News
పీజ్ రీయింబర్స్ మెంట్ పధకాన్ని అమలు చేస్తున్నాము
తాము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన పీజ్ రీయింబర్స్ మెంట్ పధకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఫీజు బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని, విద్యార్ధుల సంఖ్య ఎంత అన్నదానిపై క్లారిటీ రావడానికి సమయం పడుతుందని, అందువల్ల దీనికి సమయం పడుతుందని అన్నారు.గతంలోకూడా ఒక ఏడాది బకాయిలు కొనసాగాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక 4867 కోట్ల రూపాయలు పీజ్ రీయింబర్స్ మెంట్ కింద చెల్లించామని అన్నారు. ఈ స్కీమ్ కు తాను పూర్తి అనుకూలమని ఆయన అన్నారు. కొందరు మేధావులు డబ్బు వృదా అవుతుందని అంటారని, కాని అది కరెక్టు కాదని గతంలో కూడా తాను ఖండించానని, ఇదంతా మానవ వనరుల అభివృద్ది లో భాగమేనని తాను చెప్పానని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించిన స్కీమునే తాము కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.విద్యార్దుల కు సంబందించిన ఈ సమస్యపై ఒకటే స్వరం అంతా కలిసి వినిపించాలన్నది తమ అబిప్రాయం అని కెసిఆర్ అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








